ఇప్పుడు ఉన్న సమస్యలలో చాలా మంది ఎదురుకుంటున్న సమస్యలో ఒకటి దంతాలు పసుపు రంగులో ఉండటం. దీనివల్ల నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. దంతాలపైన డెంటినా అనే పొర తొలగిపోవడం వల్ల దంతాలు పసుపుగా మారుతాయి. దీనికి చాలా మంది ఎన్నో రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తారు అందులో ఒకటి నిమ్మరసం మరియు బేకింగ్ సోడా.
దీని వల్ల దంతాలు తెల్లగా వస్తాయి కాని, మన దంతాలకు హాని అని చాలా మందికి తెలియదు.నిమ్మరసం మరియు బేకింగ్ సోడా వాడటం వల్ల మీ దంతాలు తెల్లగా మారుతాయి. అయితే అదే సమయంలో దంతాల్లో దంతాల సెన్సిటివిటి కూడా పెరుగుతుందని ఎవ్వరికి తెలియదు దీని వల్ల దంతక్షయానికి గురిచేస్తుంది. కాబట్టి దంతాలపై ఎనామిల్ తగ్గిపోకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది.
నిమ్మరసం మరియు బేకింగ్ సోడా ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. కానీ వీటిని దంత సంరక్షణకు ఉపయోగించనప్పుడు, ప్రతికూలతలను కలిగిస్తుంది.ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను ఉపయోగించే ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఈ మిశ్రమం తరచుగా వాడటం వల్ల చిగుళ్ళకు హాని చేస్తుంది. ఇందులో ఉండే ఎసిడిక్ లెవల్స్ పంటి చిగుళ్ళను, పంటి చుట్టూ ఉన్న కండను దెబ్బతీస్తుంది మరియు నోటిపూత వంటి చికాకును కలిగిస్తుంది.
కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా మందికి కష్టం అవుతుంది. బేకింగ్ సోడ మరియు నిమ్మరసం రెండింటి యొక్క పిహెచ్ స్కేల్ గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.ఇది 1-14 వరకు ఉంటుంది. 1 నుండి 14 మద్య ఎసిడిక్ లెవల్స్ ఏమేర ఉంటాయో తెలుపుతుంది. ఎసిడిక్ లెవల్స్ ఎక్కువగా ఉంటే యాసిడ్స్ అధికంగా, లెవల్స్ తక్కువగా ఉంటే వాటిలో యాసిడ్స్ తక్కువగా ఉంటాయని తెలుపుతుంది.
ఎసిడిక్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది దంతాలపై ఉన్న ఎనామిల్ ను పూర్తిగా తగ్గిస్తుంది. అందుకు వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆహారం,టీ కాఫీలు తీసుకున్న వెంటనే నీటితో నోటిని శుభ్రపరుచుకోవడం, పరిశుభ్రతను పాటించడం వల్ల దంతాలు శుభ్రంగా,తెల్లగా,మెరుస్తుండటం మాత్రమే కాకుండా, హెల్దీగా కూడా ఉంటాయి.