చంద్ర‌బాబు.. దేశంలోనే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌.. కానీ.. అసంద‌ర్భంగా మాట్లాడ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆప‌ద‌ను మ‌రిచిపోయి అడ్డ‌దిడ్డంగా విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఆయ‌న‌తో ఎవ‌రూ పోటీప‌డ‌లేరు.  ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. ఇటీవ‌ల చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేశారు. త‌న ఉనికి కోసం అడ్డ‌దిడ్డంగా మాట్లాడారు. ఇక ఈరోజు వైసీపీ నేత అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి చంద్ర‌బాబు దుర్బిద్ధిని క‌డిగిపారేశారు. అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో రాష్ట్రం ఉంటే.. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చొని మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు. ఆప‌ద‌లో అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌కుండా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటే.. విమ‌ర్శ‌లు చేయ‌డానికి చంద్ర‌బాబు నోరెలా వ‌స్తుందంటూ అంబ‌టి ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు త‌రిమికొట్టినా చంద్ర‌బాబు బుద్ధిమాత్రం మార‌లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 

 

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా.. వారికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్నార‌ని, వారికి బియ్యంతోపాటు న‌గ‌దును కూడా అంద‌జేస్తున్నార‌ని అంబ‌టి రాంబాబు తెలిపారు. దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ధాని మోడీ బాగా ప‌నిచేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన‌డంపై కూడా అంబ‌టి రాంబాబు స్పందించారు. * చంద్ర‌బాబు గారు.. ఆనాడు మీరు ప్ర‌ధాని మోడీని ఎలా తిట్టారో మ‌రిచిపోయారా.. ఆఖ‌రికి ప్ర‌ధాని మోడీ వ్య‌క్తిగ‌త జీవితంలోకి చొర‌బ‌డి విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు ఇవ్వ‌న్నీ మ‌రిచిపోయి మీరు మాట్లాడుతున్నారు. మోడీ బూట్ల‌ను నాక‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏం ఆశించి మీరు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మోడీగారు ఏమైనా ఇస్తార‌ని మాట్లాడుతున్నారా..?  లేక లోప‌ల వేస్తార‌ని పొగుడుతున్నారా..? * అంటూ అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. చేత‌నైతే.. ఆప‌ద‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కు సాయం చేయండి.. లేదా.. సైలెంట్‌గా ఉండండి.. అంటూ అంబ‌టి రాంబాబు హిత‌వు ప‌లికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: