ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకుని దేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. కరోనా వైరస్ పు ట్టినిల్లు అయిన చైనా దేశంలో ఈ వైరస్ వ్యాప్తికి తెర పడటం లేదు. చైనాలో రెండో విడత కరోనా వైరస్ సోకుతుండటంతో అక్కడి వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో రెండు నెలలుగా విధించిన లాక్డౌన్ను చైనా ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిం దే. మరో వైపు చైనా దేశంలో కొత్తగా 63 కేసులు వెలుగుచూశాయి. కరోనాతో ఇద్దరు రోగులు మరణించారని చైనా వైద్యశాఖ అధికారులు గురువారం ప్రకటించారు. చైనా దేశంలో మొత్తంమీద 81,865 మందికి కరోనా సోకగా, వారిలో 3,335 మంది మరణించారు. చైనా దేశంలో రెండవ విడత కరోనా కేసులు బయటపడుతుండటంతో ఆ దేశ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.