కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తోన్న ఏపీ ప్రభుత్వానికి.. ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. గత నాలుగైదు రోజులుగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. సదరు కరోనా బాధితుడికి సక్రమంగా వైద్యం అందించడంతో అతడు కరోనా నుంచి తప్పించుకున్నాడు.
ఇక ఇప్పటి వరకు చూస్తే ఏపీలో మొత్తం 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా మరణాలు 4 నమోదు అయ్యాయి. ఇక ఏపీకి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజా బులిటెన్ ప్రకారం కరోనాకు సంబంధించి మొత్తం 217 మందికి పరీక్షలు చేయగా... వీరందరికి నెగిటివ్ వచ్చింది. ఇది ఓ విధంగా మంచి పరిణామం అని చెప్పాలి. ఏపీలో లాక్ డౌన్ స్ట్రిక్ట్గా అమలు చేయడంతో పాటు జగన్ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల వల్ల కరోనా తగ్గుముఖం పడుతుందనే చెప్పాలి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple