నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిక్కుల్లో పడ్డారు. లోక్ స‌భ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి ప ట్టిం చారనే ఆరోపణలపై  అనర్హతకు గుర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.  గత ఏడాదిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ సంచలన విజయం సాధించారు. అలాంటి ధర్మపురి అరవింద్ విద్యార్థత విషయంలో తప్పుగా ఎన్నికల సంఘానికి అఫిడ‌విట్ సమర్పించడంతో ఇప్పుడు ఆ కేసుల్లో ఇరుక్కున్నారు.
 
ధర్మపురి అరవింద్ రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని జనర్ధాన్ రాయ్ నగర్లోని రాజస్థాన్ విద్యాపీఠం నుంచి పొలిటికల్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చదివినట్టు  అఫిడవిట్ లో పేర్కొన్నారు.  అయితే తాజాగా ఈ విషయాన్ని రాబట్టాడు టీఆర్ఎస్ నాయకుడు మన్ను క్రిశాంక్. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యానారాయణ అల్లుడు. ఆర్టీఐ ద్వారా అరవింద్ చదివిన విశ్వవిద్యాలయంలో ఆరా తీయగా.. ఎంఏ పొలిటికల్ సైన్స్ చద‌వ‌లేద‌ని 
తేలింది. అసలు తమ విశ్వవిద్యాలయంలో అర‌వింద్ పేరు నమోదు కాలేద‌ని క్రిశాంక్ కు ఆర్టీఏలో సమాధానం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: