ప్రస్తుతం కరోనాతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. దేశంలో కరోనాని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనాని కట్టడి చేయడానికి ప్రతిక్షణం ముఖ్యమంత్రులు.. అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపి మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీ అధినేత చంద్రబాబు పై సీరియస్ అయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనాతో కష్టాలు పడుతుంటే.. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మెదడుకు నీచ రాజకీయ వైరస్ సోకిందని ఎద్దేవా చేశారు. ఆయన ఏ విషయంపై అయినా సరే రాజకీయాలు చేయకుండా ఉండలేక పోతున్నారని అన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు రాజకీయాలే చేస్తున్నారని అన్నారు. కరోనా పేరుతో రాజకీయాల లేఖలు రాస్తున్నారని అన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంత వరకు న్యాయం అని అన్నారు. మాస్కులు లేవు.. ఎక్విప్ మెంట్స్ లేవు అంటూ తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. మీ స్వలాభాలు ఈ సమయంలో కాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. వారికి ధైర్యాన్ని నింపాలని అన్నారు.
విశాఖలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనకా పల్లి, నక్కపల్లి, అరకు, చింతపల్లి ప్రతి చోట 20 నుంచి 30 వరకు మెడికల్ అక్విప్ మెంట్స్, N95 మాస్కులు ఉన్న పరిస్థితి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. N95 మాస్కులు రోజు తప్పించి రోజు మార్చి వాడితో కొన్ని రోజులు వాడొచ్చు అని అన్నారు. ఈ విషయాలు తెలిసి కూడా డాక్టర్ సుధాకర్ ఎలా రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం, మెడికల్ వ్యవస్థ, ముఖ్యమంత్రిపై పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయడం బాగా అలవాటు అయ్యిందని ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple