బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి భారీ విరాళం ప్ర కటించి గొప్ప మనుసును చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించి పలువురి కి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కు (పీపీఈ) అక్షయ్ కుమార్ ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్మ్ శుక్రవారం ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఇక కరోనా సంక్షభంలోనూ విరామం లేకుండా పనిచేస్తున్న వారికి అక్షయ్ ధ న్యవాదాలు తెలిపారు. ‘మమ్మల్ని, మా కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి.. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తన్న వైద్యులు పోలీసులు, పా రిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.