లాక్ డౌన్ పొడిగింపుపై రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం మూడు గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంతి వర్గ సమావేశం జరగనుంది. కరోనా వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కరోనా నియంత్రణ, అకాల వర్షాలకు పంట నష్టం, వలస కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై సీఎం చర్చించనున్నారు.
ఇప్పటికే కేసీఆర్ లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ ప ట్నాయక్ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే బాటలో కేసీఆర్ నడిచే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు ముందే కేసీఆర్ లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.