కరోనా రక్కసి ప్రపంచం నలుమూలల విలయతాండవం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కర్నూల్ జిల్లా టాప్ లో ఉంది. అయితే కర్నూల్ జిల్లా లో తాజాగా మరో ఐదు కొత్త కేసులు నమోదు అయ్యాయని ఆ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలియజేసారు. తాజాగా వచ్చి చేరిన ఐదు పాజిటివ్ కేసులతో కలిపి 82 పాజిటివ్ కేసులు కలిపి ఆంధ్రప్రదేశ్ లోనే ముందంజలో ఉంది.

 

ఐతే నిన్నశుక్రవారో ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ అంతటా కలిపి 16 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  గుంటూరులో7, తూర్పుగోదావరి జిల్లాలో 5, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివారు 381  కేసులు ఉండగా కర్నూలో వచ్చిన కొత్త కేసులు కలిపి 386  కేసులు గా ఉన్నాయి . ఇందులో పది మంది కోలుకొని ఇంటికివెళ్ళగా ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు . ఆంధ్రాలో ఇప్పటివరకు 370 కేసులు యాక్టీవ్ కేసులు గా ఉన్నాయి  

 

మరింత సమాచారం తెలుసుకోండి: