క‌రోనాపై పోరులో ప్ర‌తి ఒక్క‌రూ మేము సైతం అంటూ స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు. ఈమేర‌కు మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై యుద్ధంలో తాను సైతం అంటూ క‌దులుతున్నారు.  ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారు. వీటిని అవ సరమైన వారికి అందజేస్తున్నామ‌ని ఆమె చెబుతున్నారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశం పట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

క‌రోనాపై పోరులో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరుపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించిన విష‌యం తెలిసిందే. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. కరోనా నియంత్రణలో పోలీసుల కృషి అమోఘమని కొనియాడిన చిరంజీవి, ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: