దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రంలో కరోనాని అరికట్టేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులు సవేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిమ్మగడ్డ రమేశ్ ను ఎస్ఈసీగా తొలగించడంపైనా మోపిదేవి స్పందించారు. చంద్రబాబు హైదరాబాదులో కూర్చుని మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఏంజరిగినా చంద్రబాబు హైటెక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ పనిచేశారంటూ ఆరోపణ చేశారు.
ఆయన చేసిన పనికి.. తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇక్కడ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతూ ప్రజాప్రతినిధులు, అధికారులతో పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు మనోధైర్యం కావాలి.. అంతే కానీ కరోనాపై కూడా రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు అని అన్నారు.
చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ రమేశ్ పనిచేస్తున్నారని తెలిసిందని, విషయం తెలిసిన తర్వాత మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని మోపిదేవి వెల్లడించారు. సందర్భాన్ని బట్టి కొన్నిగంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వకుండా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా బాబు కరోనా రాజకీయాలు మానేసి ప్రజలకు, ప్రభుత్వానికి పనికి వచ్చే మాటలు మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple