కరోనా కోసం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కరోనా వ్యాప్తిని ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయి. నిన్నటి వరకు 381 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇవాళ ఒక్కరోజే 24 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి , గుంటూరు జిల్లాలో అత్యధికంగా 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా. కర్నూల్ లో 5 కేసులు నమోదు అయ్యాయి, కడప మరియు కర్నూల్ జిల్లాలలో ఒక్కొక్క కేసు నమోదు కావడం జరిగింది.

 

 కొత్తగా వచ్చి చేరిన ఈ 24 పాజిటివ్ కేసులను కలుపుకొని మొత్తం 405 పాజిటివ్ కేసులు గా నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటివరకు 11 మంది డీఛార్జ్ కాగా ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతానికి 385 మంది హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంత పురంలో 15 , చిత్తూరులో 20 , తూ.గో 17 , గుంటూరులో 75 , కడప 30 , కృష్ణ 35 , కర్నూల్ 82 . నెల్లూరు 42 , ప్రకాశంలో 46 . విశాఖలో 20 , ప.గో 22 అన్ని కలిపి 405 పాజిటివ్ కేసులు ఉన్నాయ్ . 

 

ఇప్పటికే నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో సమావేశం జరిపారు . ఇందులో భాగంగా లాక్ డౌన్ పై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. రెడ్ జోన్స్ , ఆరంజ్ జోన్స్ మరియు గ్రీన్ జోన్స్ లను తాము గుర్తించామని . రెడ్ మరియు ఆరంజ్ జూన్ లలోని ప్రాంతాలను లాక్ డౌన్ పొడిగిస్తూ గ్రీన్ జోన్ లను లాక్ డౌన్  ఎత్తివేయవలసిందిగా ప్రధాన మంత్రిని కోరడం జరిగింది 

మరింత సమాచారం తెలుసుకోండి: