తెలంగాణలో కరోనా ప్రభావం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో 14 మంది చనిపోయారు. డిశ్చార్జ్ అయిన వారు 96 మంది.. యాక్టీవ్ కేసులు 393 నమోదు అయ్యాయి. తొలిదశలో విదేశాల నుంచి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ 503 కు చేరిన కరోనా కేసులు.. మర్కజ్ నుంచి వచ్చిన 1200 మందిని గుర్తించామని అన్నారు. క్వారంటైన్ లో ఉన్నవారు 1654 . ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. జీహెచ్ ఎంసీ పరిధిలో 123 కంటైన్ మెంట్ జోన్ లు 245 గుర్తించి..అన్నింటిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
అక్కడ మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికీ సీరియస్ లేదు.. ఆక్సీజన్, వెంటిలేషన్ పెట్టే పరిస్థితి లేదని అన్నారు. ఈ దశ నుంచి సంక్రమణ తగ్గిపోతే.. భగవంతుడు అనుకూలించి.. ఏప్రిల్ 24 వరకు కాస్త ఉపశమన అవుతుందని భావిస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో ఉన్నవరు నెగిటీవ్ వచ్చి డిశ్చార్జ్ కావడం జరుగుతుందని నమ్ముతున్నానన్నారు సీఎం కేసీఆర్.
బయట క్వారంటైన్ లో ఉన్నవారు కూడా రిలీజ్ కావడం జరుగుతుందని అన్నారు. కొత్త ఉప్పెన వచ్చి పడకపోతే మనం చాలా వరకు ఈ కష్టాల నుంచి బయట పడ్డట్టే అన్నారు. ఎవరూ భయపడొద్దు.. కష్టాలు వచ్చినపుడు తెలంగాణ ప్రజలు గట్టి పట్టుమీద ఉన్నారు.. లాక్ డౌన్ పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించే వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple