ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. భార‌త్‌లోనూ కోవిడ్‌-19 విజృంభిస్తోంది. దేశంలో ప్ర‌స్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 8752 లుగా ఉంది.

 

 ద‌వాఖాన‌ల‌ను నుంచి 1019 మంది కోలుకుని ఇంటికి చేర‌గా, వైర‌స్ బారిన ప‌డి 285 మంది మ‌ర‌ణించారు.  కరోనా పేషెంట్లను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఈ క్రమంలోనే బీహార్‌లోని పట్నా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి నుంచి పరారైంది. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కరోనా వైరస్ సోకిన 72 ఏళ్ల మహిళ.. ఆస్పత్రి నుంచి పారిపోయిందని ద‌వాఖాన వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

 

దీ నిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రభుత్వ గణాంకాల ప్రకారం బీహార్‌లో ఇప్పటి వరకూ 63 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మరణించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: