ఎప్పుడూ అమ్మాయిల వెంట అబ్బాయిలు పడుతుంటారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో రష్మిక మాత్రం మహేశ్బాబును ప్రేమలో పడేసేందుకు ‘మీకు అర్థమవుతుందా ?’ అంటూ చాలా ప్రయత్నాలే చేసింది. మహేశ్బాబు వెంట పడుతూ.. చిత్రంలో రష్మిక ఓ పాటేసుకున్న విషయం తెలిసిందే. ఈ పాట ఎంతో పాపులర్ అయిందో తెలిసిందే..
తాజాగా రష్మిక కన్నడలో నటిస్తున్న చిత్రం ‘పొగరు’.. ఇందులో హీరో తనను ప్రేమించమంటూ రష్మిక వెంట పడ్డాడు. ధృవ సర్జా హీరోగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల ఈ వీడియో సాంగ్ను విడుదల చేశారు. అయితే ఈ పాటపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుంచి అలాగే సినిమా నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ పాటలో హీరో ధృవ, హీరోయిన్ రష్మికను ప్రేమించమంటూ ఇబ్బంది పెట్టిన తీరే ఇందుకు కారణం. ఆడవాళ్లని అంత ఘోరంగా హింసిస్తారా? మహిళలంటే అంత చిన్నచూపా? వెంటనే ఈ పాటను తొలగించకపోతే ఉద్యమిస్తాం.. అంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి?.