దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌తీరోజు పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో న‌మోదు అవుతోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది వేలు దాటింది. అయితే.. ఇందులో  మ‌హారాష్ట్ర‌లోనే అత్య‌ధిక కేసులు ఉన్నాయి. ఒక్క ముంబైలోనే 1339 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రం మొత్తం రెండువేల‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. అత్య‌ధికంగా వైద్య‌సిబ్బంది క‌రోనా బారిన ప‌డింది కూడా ముంబైలోనే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. తాజాగా.. ఓ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

గ్రేట‌ర్ నోయిడాలోని క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్య‌క్తి క‌రోనా భ‌యంతో తీవ్ర మాన‌సికి ఒత్తిడికి లోన‌య్యాడు. ఈ క్ర‌మంలో భ‌వనంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దేశ‌వ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏదో ఒక‌చోట జ‌రుగుతూనే ఉన్నాయి. క‌రోనా భ‌యంతో ఇటీవ‌ల ఢిల్లీలో కూడా ఓ వ్య‌క్తి ఆస్ప‌త్రి భ‌వ‌నంపై దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి వ‌చ్చినా ఆ వ్య‌క్తిని అధికారులు ఎయిర్‌పోర్టులోనే ప‌రీక్షించి, ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా భ‌వనంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: