కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం పలు నింర్ణయాలను తీసుకొంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన జనం ఏదో ఓ వంకతో రోడ్లపైకి వస్తున్నారు. కొంత మంది సిల్లీ రీజన్స్ చెబుతున్నారు మరియు కరోనా వ్యాప్తికి కారకులు అవుతున్నారు. ఈ పరిస్థితులలో కేంద్రం లాక్ డౌన్ అమలుకు కొన్ని పథ చట్టాలను తీసుకురానుంది. అదే కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ చట్టం-2005 . ఈ చట్టం కింద పలుసెక్షన్ లు ఉంటాయి. ఇందులో సెక్షన్-52 నుండి 60 వరకు విపత్తు సమయంలో తీసుకోవలసిన చర్యలు ఉంటాయి. కరోనా కట్టడికి ఈ చట్టం చాల ఉపయోగ పడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నారు. మరి ఏ సెక్షన్ ఎలా ఉందొ చూదాం 

 

సెక్షన్‌ 51: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను సరైన కారణం లేకుండా అతిక్రమించేవారికి ఏడాది జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఆపద వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనా సదరు వ్యక్తికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నది. 

 

సెక్షన్‌ 52: ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి అధికారుల నుంచి ఏదైనా సాయం పొందినా, ఏవైనా పనులు చేయించుకున్నా వారికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిమానా, జైలుశిక్ష రెండూ విధించవచ్చు. 

 

సెక్షన్‌ 53: విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులు లేదా నగదును ఎవరైనా దుర్వినియోగం చేసినా, లేదా పారబోసినా అలాంటి వ్యక్తులకు రెండేండ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. 

 

సెక్షన్‌ 54: ప్రజలను గందరగోళపరిచేలా, ఆందోళన కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారికి గరిష్ఠంగా రెండేండ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ శిక్షలు విధిస్తారు. 

 

సెక్షన్‌ 56: విధినిర్వహణలో విఫలమైనా, అనుమతి లేకుం డా విధుల నుంచి తప్పుకొ న్నా, ఈ చట్టం కింద ప్రభు త్వం అప్పగించిన బాధ్యతల అమలులో విఫలమైనా, లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల నుంచి వైదొలగినా గరిష్ఠంగా ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నది. 

 

సెక్షన్‌ 55: ప్రభుత్వ అధికారి/ ఏదైనా విభాగం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకు ఆదేశించవచ్చు. తనకు తెలియకుండానే ఆ తప్పు జరిగినట్టు నిరూపించే ఆధారాలు సమర్పిస్తే విచారణ నుంచి మినహాయింపు ఉంటుంది. 

 

సెక్షన్‌ 57, 58: విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్‌ బాడీ ఉల్లంఘించినట్టు నిరూపితమైతే ఆ కంపెనీ డైరెక్టర్‌, మేనేజర్‌, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. 

 

సెక్షన్‌ 59: సెక్షన్‌ 55, 56ల కింద నమోదైన కేసుల ప్రాసిక్యూషన్‌కు వినియోగిస్తారు. 

 

సెక్షన్‌ 60: ఈ  చట్టం పరిధిలోని అంశాల్లో కోర్టులు నేరుగా కలుగజేసుకునే అవకాశం ఉండదు.

 

కాబట్టి మనమంతా లాక్ డౌన్ ని గౌరవిద్దాం మరియు పాటిద్దాం. ఇతరులకు ఇప్పంది కలుగకుండా ఇంట్లోనే ఉందాం 
 

మరింత సమాచారం తెలుసుకోండి: