దేశంలో నానాటి కీ కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణం విదేశీయులు అని అప్పట్లో అన్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన పార్థనలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్న వారు వెళ్లడం.. వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందడం జరిగిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొంత మంది కరోనా లక్షణాలు ఉన్నా చాటు మాటుగా ఉండటం.. స్వచ్ఛందంగా లొంగి ట్రీట్ మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఈ పరిణామాలు ఎక్కువగా జరిగాయని అంటున్నారు.
తాజాగా ఇప్పుడు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన పార్థనల మాదిరగానే.. ఉత్తరప్రదేశ్ డియోబంద్కు వెళ్లిన వారిలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరు డియోబంద్కు వెళ్లి వచ్చారని అనుమానిస్తున్నారు. నిజాముద్దీన్ తరహాలోనే యూపీలో ప్రార్థనలు జరిగాయని తెలుస్తుండగా.. నిజాముద్దీన్ వెళ్లిన వారు యూపీ డియోబంద్.. ఆ తర్వాత రాజస్థాన్ ఆజ్మీర్ దర్గాను సైతం సందర్శించారని చెబుతున్నారు.
దాంతో ఇప్పుడు అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అక్కడ నుంచి ఎంత మంది వచ్చారు.. వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో... ప్రస్తుతం యూపీ డియోబంద్ ప్రార్థనలకు హాజరైన వారి లెక్కలు తీసే పనిలో తెలంగాణ పోలీసులు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple