‘కరోనాతో నేను ఆస్పత్రిలో చేరడం మంచిదైంది.. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి వెళ్తున్నా’ అంటోంది బాలీవుడ్ నటి జోవా మొరానీ.. ఇటీ వల కరోనా పాజిటివ్ రావడంతో దవాఖానలో చేరారు. ఇప్పడు పూర్తి గా నయం కావడంతో మరో రెండు రోజుల్లో డిచ్చార్జ్ అవుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్లో లైవ్ చాట్లో మాట్లాడారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కోవిడ్-19 బారిన పడిన తాను ఎలా కోలుకుంటున్నారో వివరించారు. లైవ్లో హీరో వరుణ్ ధావన్ ఎప్పుడు డిచ్చార్జ్ అవుతున్నావని అడగ్గా.. ‘రేపు లేదా ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్తానని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చా లా ఆరోగ్యంగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. నేను ఆసుపత్రిలో చేరిన రెండో రోజు నుంచే ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది. ఇప్పుడు నా ఆరోగ్యం 40 రెట్లు మెరుగుపడిందని అని అన్నారు.