కాంగ్రెస్ సీనియ‌ర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంవీ రాజశేఖరన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 91 సంవ‌త్స‌రాలు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న రాజశేఖరన్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. క‌ర్ణాట‌కకు చెందిన రాజ‌శేఖ‌ర‌న్ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వంలో ప్ర‌ణాళికా శాఖ స‌హాయమంత్రిగా ప‌నిచేశారు. కాగా, రాజశేఖరన్ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప‌ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: