కరోనా వైరస్ కట్టడికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు లాక్‌డౌన్ చివ రి రోజు. కేంద్ర ప్రభుత్వం ఇంకా తన నిర్ణయం చెప్పక పోయినా, చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ గడువును  ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. 


ఇదిలా ఉండగా ప్రధాని మోడీ ప్రసంగించడానికి  ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియో సందేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ఈ కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఇళ్లలో సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నందుకు దేశ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

 

జూన్ వరకు ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ఉచిత రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యను సోనియా ప్రశంసించారు. అంతకు ముందు సోనియా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తోందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలి  ఆరోపణను అధికార భారతీయ జనతా పార్టీ ఖండించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: