కరోనా అనుమానితులు డాక్టర్స్ పై దాడి చేసిన సంఘటన ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో జరిగింది. ఓ పక్క కరోనా కేసులు పెరుగుతున్న వేల ప్రజల్లో భయాందోళనలు పెరిపోతున్నాయి. ఉస్మానియాలో కరోనా పాజిటివ్  వ్యక్తులను మరియు కరోనా పాజిటివ్ అనుమానిత వ్యక్తులను కలిపి ఒకే ఐసొలేషన్ వార్డ్ లో ఉంచారన్న ఆరోపణలతో అక్కడున్న వైద్య సిబ్బంది పై దాడి చేసిన సంఘటన చోటుచేసుకొంది.

 

దీనితో తెలంగాణ ప్రభుత్వం 250 రక్షక బలగాలను మోహరించింది. ఈ సంఘటనతో ఉస్మానియా వైద్య బృందం భయాందోళనలో ఉంది. అదేవిధంగా..గతంలో గాంధీ హాస్పిటల్ లో కూడా ఇదే సంఘటన జరిగింది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చొరవతో 250 రక్షక బలగాలను మోహరించింది . ఈ సంఘటన జరిగిన ఐసొలేషన్ వార్డులను మొత్తం కూడా ఇప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: