ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. ఇవాళ ఒక్క రోజే కొత్తగా రాష్ట్రంలో కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు న మోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన కరోనా నిర్దారణ పరీక్షలో పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూ రులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 16 మంది కోలుకున్న డిశార్జ్ కాగా, 11 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో లో 475 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు మృతి చెందడం గమనార్హం.