కరోనా వైర‌స్ షాకులు మామూలుగా లేవు.. ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి షాక్ ఇస్తుందో తెలియ‌క బిక్కుబిక్కుమంటూ గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. తాజాగా.. గుజరాత్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు క‌రోనా సోక‌డంతో ఒక్క‌సారిగా నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఎమ్మెల్యేకు ప‌రీక్ష‌లు చేయ‌గా కూడా క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా గుజ‌రాత్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు అమిత్ చావ్దా తెలిపారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటి నుంచి పాల‌న కొన‌సాగించ‌నున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.

 

కాగా, గుజ‌రాత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి రెచ్చిపోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఒక్క‌రోజే 33 కొత్త కేసులు న‌మోదు కాగా, ఇద్ద‌రు మ‌ర‌ణించారు. అందులోనూ అహ్మ‌దాబాద్‌లోనే అధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో పాజిటివ్  కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. వీరిలో 59మంది కోలుకున్నట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. అయితే.. ఒక్క అహ్మ‌దాబాద్ న‌గ‌రంలోనే 350కిపైగా కేసులు ఉన్నాయి. గుజ‌రాజ్ రాష్ట్రంలో న‌మోదు అవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 50శాతం వ‌ర‌కు అహ్మ‌దాబాద్‌లోనే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోందని ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ అన్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: