ఏపీలో రెండో విడత రేషన్ గురువారం నుంచి అందించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇవ్వనుంది. ఇప్పటికే తొలి విడతలో మార్చి 29 నుంచి ఒక్కో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు ఫ్రీగా ఇవ్వనున్నారు. నేటి నుంచి 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు కూడా ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇక సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు వీలుగా వలంటీర్లు ముందుగానే టైం స్లాట్ కూపన్లు కూడా ఇవ్వనున్నారు. దీని వల్ల ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు రావు. రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే 1902కు కాల్ చేయవచ్చు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple