ఆంధ్రప్రదేశ్ లో మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో కర్నూలు నెల్లూరు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 113 కి చేరుకుంది.  

 

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. నెల్లూరు లో 58 కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 534 కి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: