ఏపీలో మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారంపై ముందు నుంచి అదిరిపోయే సెటైర్లతో విరుచుకుపడుతున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. తాజాగా నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఉన్న సంతకానికి, ఆయన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఉన్న సంతకానికి మధ్య చాలా తేడా ఉందని.. నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఉన్న సంతకం ఫోర్జరీకి గురైనట్టు ఉందని.. ఈ లేఖ సైతం మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీస్ నుంచే కేంద్ర హోం శాఖకు మెయిల్ వెళ్లిందని.. దీనిపై పక్కా ఆధారాలు ఉన్నాయని కూడా విజయసాయి డీజీపీకి లేఖ రాశారు. ఇందులో వాస్తవం ఉన్నట్టు తేలితే నివేదిక వచ్చిన వెంటనే ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజయసాయి డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయితే దీనిపై బుధవారం సాయంత్రం నిమ్మగడ్డ స్పందిస్తూ ఈ లేఖ తానే రాశానని చెప్పారు. అయితే తాజాగా విజయసాయిరెడ్డి నిమ్మగడ్డ వ్యాఖ్యలపై స్పందించారు. నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద స్పందించకుండా హైదరాబాద్కు జారుకున్నారని... ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు జరపమనగానే ఆయనలో ముచ్చెమటలు స్టార్ట్ అయ్యాయని ఎద్దేవా చేశారు. నెల తర్వాత నోరు విప్పితే ఈ లేఖ రాసింది తానే అంటున్నారని.. దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఇప్పటకి బోధ పడినట్లుందని విజయసాయి విమర్శించారు. మరి ఈ వ్యవహారంలో నిజంగానే నివేదిక వస్తే ఏం జరుగుతుందో ? చూడాలి.
కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్లున్నాయి. నెల తర్వాత నోరు విప్పి లేఖ రాసింది తానే అంటున్నారు. దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఇప్పటికి బోధపడినట్లుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2020