మాస్క్ ధరించని విషయమై అధికారికి మరియు కానిస్టేబుల్ జరిగిన గొడవలో  లో సదరు అధికారి కానిస్టేబుల్ పై చేయిచేసుకున్న ఘటన ఢిల్లీలోని ప్రేమ్ నగర్ లో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలోఢిల్లీ ప్రభుత్వం మాస్క్ ధరించడం తప్పని సరి చేసింది. జోగేంద్ర అనే కానిస్టేబుల్ మరియు కొంతమంది పోలీస్ లు మరియు సీఆర్పీఎఫ్ జవానులతో ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నాడు.

 

ఆ సమయంలో అటుగా వచ్చిన ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ జోగేంద్ర మాస్క్ ధరించకపోవడం గమనించాడు. అధికారి ..మాస్క్ ఎందుకు ధరించలేదు అని జోగేంద్రను అడుగగా జోగేంద్రకు మరియు అధికారికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగొడవలో ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ మాస్క్‌ధరించని కానిస్టేబుల్ పై లాఠీతో దాడిచేశాడు. ఈ విషయాన్నీ జోగేంద్ర అధికారులకు ఫిర్యాదు చేయగా ఆఫీసర్ పై చర్యలకు ఆదేశించింది. అదేవిధంగా అసలు అక్కడ ఏమ్ జరిగిందో తెలుసుకోవడానికి  ఉన్నతాధికారులు ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: