హైద‌రాబాద్లో అతిపెద్ద సూప‌ర్ మార్కెట్ అయిన ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క వ్యాపార‌స్తుడు కూడా విన‌యోగ‌దారుడిని మోసాల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సీరియ‌స్‌గా ఆదేశాలు జారీ చేశారు. ఈ టైంలో కొంద‌రు వ్యాపార‌స్తులు.. ఇలాంటి సూప‌ర్ మార్కెట్ల యాజ‌మాన్యాలు మాత్రం వినియోగ‌దారుల‌ను దారుణంగా మోసం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణలు అయితే ఉన్నాయి.

 

ఈ క్ర‌మంలోనే శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఉన్న ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్ కస్టమర్లకు అందించే సేవ‌ల‌పై ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం త‌నిఖీలు చేసింది. ఈ సూప‌ర్ మార్కెట్‌పై వినియోదారుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదులు మేర‌కు త‌నిఖీ చేయ‌గా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. దీంతో సూప‌ర్ మార్కెట్‌ను సీజ్ చేసిన ఈవీఎండీ బృందాలు ఈ సూప‌ర్ మార్కెట్ స్థావ‌రాలు అన్నింటిని ప‌రిశీలిస్తున్నారు.

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం..

క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: