ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థులు అన్నింటిని కుప్పకూల్చిన కరోనా మహమ్మారి మన దేశంలో కూడా రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఇప్పటి వరకు చూస్తే మనదేశంలో ఈ రోజు 941 కొత్త కరోనా కేసులు బయట పడ్డాయి. అదే క్రమంలో మొత్తం కరోనా మరణాలు 414కు చేరుకున్నాయి.
ఇక మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13 వేలకు చేరువలో ఉండగా.. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మరణాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ తో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొన్నారని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైద్యులను కాపాడుకోవడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి అని కేంద్రం ప్రకటించింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple