ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై యుద్ధానికి గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొవిడ్-19పై ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఆమెతో మాట్లాడారు. కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. అయితే.. తాజాగా.. ఏప్రిల్ 18న రాత్రి 8గంటలకు ఈటీ వన్ వరల్డ్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రియాంకచోప్రా పాల్గొంటోంది.
ఇందులో అనేక మంది ఆరోగ్య నిపుణులు, కళాకారులు, ఫ్రంట్లైన్ వర్కర్లు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కరోనా అంతానికి కృషి చేస్తున్న వారికి ప్రియాంక చోప్రా సంఘీభావం తెలుపనుంది. దీంతో ఈ కార్యక్రమం కోసం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి ఒప్పుకున్న ప్రియాంక చోప్రాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనాపై గెలువడానికి ఇలాంటి స్టార్లు మరింతమంది ముందుకు రావాలని సూచిస్తున్నారు.