కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు శరవేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఆగడం లేదు. శుక్రవారం ఉదయం 9 గంటల అప్డేట్స్ ప్రకారం చూస్తే మనదేశంలో మొత్తం కేసుల సంఖ్య 13400కు చేరుకుంది. ఇక ఇప్పికే 437 మంది కరోనా సోకి మృతి చెందారు. కరోనా యాక్టివ్ కేసులు 11, 201 ఉన్నాయి.
ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 1748 మంది ఉన్నారు. ఇక గత 24 గంటల్లోనే ఈ కేసులు 1007గా నమోదు అయ్యాయి. దీనిని బట్టి మనదేశంలో కూడా కరోనా కేసులు సగటున రోజుకు వెయ్యికి చేరుకుంటున్నాయన్నది స్పష్టమైంది. ఇక అటు ఏపీలో కరోనా కేసులు 535కు చేరుకోగా, ఇటు తెలంగాణలో ఈ కేసుల సంఖ్య 700 దాటేసింది. ఏదేమైనా కరోనా కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు.
#IndiaFightsCorona:#COVID19 india UPDATE:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 17, 2020
▪️ Total Cases - 13387
▪️Active Cases - 11201
▪️Cured/Discharged- 1748
▪️Deaths - 437
▪️Migrated - 1
as on april 17, 2020 till 8:00 AM pic.twitter.com/1FQSXBS3eB