క‌రోనా పాజిటివ్ కేసుల‌తో సూర్యాపేట జిల్లా హ‌డ‌లెత్తిపోతోంది. గురువారం ఒక్క రోజే జిల్లాలో 16 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా,..వారిలో ఎవ‌రికీ క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని క‌లెక్ట‌ర్ విన‌య్ తెలిపారు.  ఇందులో ఒక్క సూర్యాపేట ప‌ట్ట‌ణంలోనే  14 కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. తిరుమ‌ల‌గిరి, ఆత్మ‌కూరు ఎస్ మండ‌లం ఏపూర్ గ్రామంలో ఒక్కో పాజిటివ్ కేసు న‌మోద‌డవ‌డం స్థానికుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

 

ఈనెల 2 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో సూర్యాపేటలోనే 28 కేసులు నమోద య్యాయి. నాగారం మండ‌లంలో 6 కేసులు, తిరుమ‌ల‌గిరిలో 3, ఏపూరు , నేరుడుచ‌ర్ల‌లో ఒక్కోటి చొప్పున క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఏపూర్‌లో ఆరేళ్ల బాలుడికి క‌రోనా సోక‌డం గ‌మ‌నార్హం.   

మరింత సమాచారం తెలుసుకోండి: