క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ దాస్ శుక్ర‌వారం ఉద‌యం 10గంట‌ల‌కు విలేక‌రుల‌తో మాట్లాడారు. క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మాన‌వాళి అతిపెద్ద స‌వాలును ఎదుర్కొంటోంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హాత్మా గాంధీ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేశారు. *మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. స‌త్యాస‌త్యాల‌ మధ్యలో కొనసాగుతోంది. చీకటిని చీల్చుతూ వెలుగు రేఖ వ‌స్తుంది* అని గాంధీని చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం మాన‌వాళి అతిపెద్ద స‌వాలును ఎదుర్కోంద‌ని, ఈ చీకటిని త‌రిమికొట్టేందుకు మ‌నంద‌రం కంక‌ణ‌బ‌ద్ధులం కావాల‌ని, ఆ దిశ‌గా క‌ద‌లాల‌ని ఆయ‌న సూచించారు.

 

ఇంత‌టి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా భార‌త్ ఆశాజ‌న‌క‌మైన వృద్ధి సాధిస్తుంద‌ని అన్నారు. భార‌త్ 1.9శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. 2021-22లో భార‌త్ 7.4శాతం వృద్ధి సాధిస్తుంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంతదాస్‌ వెల్ల‌డించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగుప‌ర్చ‌డానికి ఆర్బీఐ అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని తెలిపారు. భార‌త్‌లో ఏప్రిల్ నెల‌లో ఆహార ధ‌ర‌లు ఏకంగా 2.4శాతం పెరిగాయ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ వెల్ల‌డించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: