ఎండా కాలం వచ్చిందంటే.. దేశ వ్యాప్తంగా పుచ్చకాయలు కనిపిస్తుంటాయి. పుచ్చకాయతో జ్యూస్ అంటే జనం ఎగబడుతుంటారు. అన్ని మార్కెట్లలో పుష్కలంగా లభిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు పుచ్చకాయల వ్యాపారులకు కష్టాలు వచ్చిపడ్డాయి. గత నెల 24 నుంచి లాక్ డౌన్ కారణంగా మార్కెట్ లోకి పుచ్చకాయలు తరలించడానికి ఇబ్బంది పడుతున్నారు రైతులు.
చెన్నై నగరంలోని ఎక్కువగా పుచ్చ పంట పండిస్తున్నారు. ఇప్పుడు, కరోనావ మహమ్మారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నందున పుచ్చపండ్లు పెరిగిన వాటిని వివిధ ప్రాంతాలకు పంపేందు ట్రాలెల్ సౌకర్యం లేదు. ఈ పుచ్చకాయలను పండించే చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లోని రైతులు డిమాండ్ను తగ్గించడంతో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు.
పుచ్చపండ్లు రెస్టారెంట్లు, జ్యూస్ షాపులకు విరివిగా వెళ్లేవని కానీ ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో రైతులు తమ ఉత్పత్తులను తరలించలేకపోతున్నారు. వారు ఇప్పుడు తమ పొలాలలో పూర్తిస్థాయిలో పండ్లను వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలను గమనించాలని ఈ ప్రాంతానికి చెందిన సేంద్రీయ రైతు అల్లాది మహాదేవన్ కోరారు. జ్యూస్ షాపులు పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలన్నది ఈసందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 20 తర్వాత పరిస్థితులను బట్టి డేంజర్ జోన్లు కాని ప్రదేశంలో లాక్ డౌన్ సడలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
Watermelon, which is usually sold for Rs 15 per kilo by farmers, is now fetching them only Rs 2.50 to Rs 4. https://t.co/bRimuWmhhF
— Anjana Shekar (@AnjanaShekar) April 16, 2020