ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ కేసులు 22 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 1.47 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక మ‌న‌దేశంలో ఈ కేసులు 14 వేల‌కు చేరుకున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు 448 గా ఉన్నాయి. ఇక దేశంలో ప‌రిస్థితులు రోజు రోజుకు దిగ‌జారుతున్నాయి. ఇక మ‌న‌దేశంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నాటికి మ‌రిన్ని కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.

 

ముఖ్యంగా మిగిలిన రాష్ట్రాల క‌న్నా మ‌హారాష్ట్ర‌లోనే ప‌రిస్థితి ఘోరంగా ఉంది. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో 1007 మందికి కొత్త‌గా కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో 29 మంది మృతి చెందారు. దేశంలో ప్ర‌తి ఆరు రోజుల‌కు కేసులు రెట్టింపు అవుతున్నాయ‌ని చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విష‌యంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: