కరోనా కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. ధారావిలో గురువారం ఒక్కరోజే 26 మందిని పరీక్షించగా పాజిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. దీనితో ధారావిలోని కేసుల సంఖ్య 86 కి చేరాయని ఈ సందరభంగా బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. అయితే ధారావిలో మరో మరణం  కూడా సంభవించింది దీనితో ధారావిలో మొత్తం మరణాల సంఖ్య 9 కి చేరింది.

 

మహారాష్ట్రలో కొత్తగా 165  కేసులు నమోదు కాగా మొత్తం ఆ సంఖ్య 3081 కి చేరింది. కాగా మహారాష్ట్రలో మార్చ్ 9 న మొట్టమొదటిగా నమోదైన కరోనా బాధితుడు ఇప్పుడు కోలుకొని 14 రోజుల తరువాత డీఛార్జి అయ్యాడు. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం ఇప్పటివరకు మహారాష్ట్రనుండి కోలుకున్నవారి సంఖ్య 259 కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: