హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నానాటికి కేసులు పెరుగుతూనే ఉన్నాయి . హైదరాబాద్ నెరేడ్ మెట్ లోని మధురానగర్ ప్రాంతంలో ఓ వ్యక్తికీ కరోనా పాజిటివ్ గా గుర్తించారు. సదరు వ్యక్తి  మధురానగర్ లో పది రోజుల క్రితం 100 మందికి అన్నధాన కార్యక్రం మరియు నిత్యావసరాలను పంపిణి చేశాడు ఆ కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది మరియు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

 

ఆ వ్యక్తి కుటుంభం లోని ముగ్గురితో పాటుగా మధురా నగర్ లోని పరిసర ప్రాంత వాసులను హోమ్ క్వారంటైన్ కి తరలించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులను వైద్యులు రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. వీరిలో ప్రస్తుతానికి 50 మందికి  కరోనా లక్షణాల కారణంగా పరీక్షల కోసం హాస్పిటల్ కి తరలించారు. మధురానగర్ ప్రాంతాన్ని అధికారులు అంతకుడా శానిటైజ్ చేసేపనిలో పడ్డారు. ఇందుమూలంగా అధికారులు ఫ్రీ గా వస్తున్నాయని ఎవరి దగ్గర పడితే వారిదగ్గర నిత్యావసరాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: