కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ ఢిల్లీ వాసుల కష్టాలు మామూలుగా లేవు. వీరు పడుతోన్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లక్షలాది మంది వలస కార్మికులు కనీసం తినడానికి తిండి లేక... ఇళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక తినడానికి తిండి సంగతి పక్కన పెడితే కనీసం తాగేందుకు కూడా చాలా మంది నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో నీళ్లు లేకపోవడంతో ఢిల్లీ జల్బోర్డు ప్రజలకు తాగునీరు అందించేందుకు ట్రక్కులు ఏర్పాటు చేసింది.
మీరు కింద ట్విట్లో చూస్తోన్న ఫొటోలు ఢిల్లీ వాసుల నీటి కష్టాలకు ప్రతిరూపంగా ఉండనున్నాయి. న్యూ అశోక్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లమీదకు బిందెలు, వాటర్ టిన్నులు పట్టుకు వచ్చి వాటర్ ట్యాంకులు ఎప్పుడు వస్తాయా ? అని ఎదురు చూస్తున్నారు. ఇక రోడ్ల మీద బిందెడు నీళ్ల కోసమే ఏకంగా కిలోమీటర్ల మేర క్యూలో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితి నుంచి ఢిల్లీ జనాలు ఎప్పుడు సేవ్ అవుతారో ? చూడాలి.
Delhi: people line up to collect drinking water from delhi Jal Board (DJB) trucks, amid #CoronaLockdown. Visuals from the New ashok Nagar area. pic.twitter.com/AobzDpkbmZ
— ANI (@ANI) April 18, 2020
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple