కరోనా మహమ్మారి రోజురోజుకు దేశ జనాభాను ముత్యు సాగరం లోకి నెడుతునే ఉంది. లాక్ డౌన్ కొంత వరకు కరొనను ఆపినా.నిగూఢంగా ఉన్న వైరస్ ఆందోళనలో పడవేస్తుంది. మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల పరంపర కొనసాగుతూనే ఉంది. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయ్. క్వారంటైన్ లో ఉన్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు.

 

కొమరంభీం జిల్లా అసిఫా బాద్ లోని క్వారంటైన్ లో ఉన్న యువకుడు పక్కనే కరోనా పాజిటివ్ ఉన్నవ్యక్తి వచ్చి చేరడంతో భయానికి గురి అయిన ఆ యువకుడు తనను వేరే రూమ్ కి షిఫ్ట్ చేయమని కోరాడు అందుకు సిబ్బంది నో చెప్పడంతో. తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకొనే ప్రయత్నం చేశాడు. బెంబేలెత్తి పోయిన హాస్పిటల్ సిబ్బంది అతనిని వేరే రూమ్ కి తరలించారు. ఇప్పటి వరకు తెలంగాణా మొత్తం 809  కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: