మెగాస్టార్ చిరంజీవి మ‌రో సామాజిక బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లవుతున్న నేప‌థ్యంలో ర‌క్త‌నిధి నిల్వ‌లు నిం డుకు న్నాయి.  కోవిడ్ 19 ప్రభావంతో సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇతర వ్యాధులతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొందరు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.  అందులోనూ రక్తం అవసరమున్న వాళ్లకి కష్టాలు తప్పడం లేదు. ఆప‌రేష‌న్స్ స‌హా ప‌లు సంద‌ర్భాల్లో ర‌క్తం అవ‌స‌రం ఎంతో ఉంటుంది. 

 

కానీ ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ర‌క్త‌దానం చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. అభిమానులకు ఓ సందేశాన్నిచ్చారు. తాను ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసి చిరు తన అభిమానులు కూడా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.  కొద్ది రోజుల క్రితం హీరో నాని, అతని భార్య అంజనా కూడా రక్తదానం చేసిన విషయం తెలిసిందే. రక్తదానం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని పేర్కొన్న నాని.. భయాలను పక్కన పెట్టిన రక్తదనం చేయాలని కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: