తెలుగు రాష్ట్రాలలో కరోనా కలకలం రోజు రోజు కు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం   647 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే 17 మరణాలు కరోనా వల్ల సంభవించాయి. గడచిన 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కృష్ణ జిల్లా నుండి కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి దీనితో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 75 కి పెరిగింది మరియు ఈ జిల్లాలో 5 మరణాలు సంభవించాయి.

 

తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి దీనితో జిల్లాలో 24 కేసులు మొత్తం గా ఉన్నాయి. గుంటూరులో ఈవాళ కొత్తగా 3 కరోనా  కేసులు నమోదయ్యాయి ఈ జిల్లాలో 129 కేసులు మొత్తంగా ఉన్నాయి మరియు ఈ జిల్లాలో 4 మరణాలు సంభవించాయి. అనంతపురంలో కొత్తగా 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి దీనితో 29 కేసులు మొత్తంగా ఉన్నాయి . విశాఖ జిల్లాలో 14 రోజుల తరువాత ఒక కేసునమోదు అయ్యింది దీనితో ఈ జిల్లాలో కేసుల సంఖ్య 21 కి పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: