దేశంలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రలు తమ అధికారుల, మంత్రి వర్గంతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ కరోనా ప్రభావం గురించి తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఈ విషయం పై సంక్షిప్తంగా వివరిస్తున్నారు. తాజాగా తెలంగాణలో కరోనా వ్యాప్తి గురించి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో 8 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయి. తెలంగాణలో పది రోజులకు ఒకసారి రెట్టింపు అవుతున్నాయి.
మరణాల రేటు దేశంలో 3.22 శాతం, తెలంగాణలో 2.44 శాతం. ఈ రోజు కొత్తగా 18 మందిని గుర్తించినట్లు చెబుతున్నారు. మొత్తం రాష్ట్రంలో 858 పాజిటీవ్ కేసులు ఉన్నాయి. మొత్తం 186 మంది డిశ్చార్జి అయ్యారు. నాలుగు జిల్లాల్లో మాత్రం కరోనా పెద్దగా లేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి, సిద్దిపేటల్లో కేసులు లేవు.. ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు అన్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple