తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తోన్న కేసీఆర్ ప్రెస్మీట్లతోనే ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ అమెరికాలో తన మిత్రుడు ఒకరు అక్కడ ప్రజల చావుల గురించి చెప్పిన మాట వింటేనే తన మనస్సును కలిచి వేసిందన్నారు.
అమెరికాలో ప్రజలు పిట్టల్లా చనిపోతున్నారని.. కనీసం అక్కడ డెడ్ బాడీలు అయిన వారే గుర్తించలేని స్థితుల్లో ఉన్నాయని తన మిత్రుడు చెప్పినాడని.. ఇలాంటి చావులు మనకు దయచేసి వద్దని.. ఇందుకు ప్రజలు అందరూ స్వీయ కట్టడిలో ఉండాలని చెప్పారు. ఇక ప్రతి ఒక్క వ్యక్తి నాకు కరోనా రాకూడదు అని అనుకుంటే కరోనా రాదన్నారు. ఇదే మాట ప్రతి కుటుంబం.. ప్రతి గ్రామం.. ప్రతి పట్టణం అనుకుంటే కరోనాను నియంత్రించవచ్చని కేసీఆర్ తెలిపారు.