దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప‌క‌డ్బందీగా అమ‌లు అవుతోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్నాయి.  ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. కేవ‌లం నిత్య అవ‌స‌ర వ‌స్తువుల‌కి మిన‌హా ఎవ‌రూ దేనికి బయ‌ట అడుగు పెట్ట‌డం లేదు. ఈ స‌మ‌యంలో కాలేజీలు,  స్కూళ్లు కూడా మూసివేశారు.  అయితే ఆన్ లైన్ క్లాసులు మాత్రం నిర్వ‌హిస్తున్నారు. ఇక తెలంగాణ‌తో స‌హా చాలా రాష్ట్రాల్లో విద్యార్థుల‌ను ఒక‌టి నుంచి 9  త‌ర‌గ‌తుల  వ‌ర‌కూ ప్ర‌మోట్ చేశారు .

 

తాజాగా ఈ నెల 21 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణ‌యించింది. లాక్‌డౌన్ ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై ప డకూడదని, కావున ఆన్‌లైన్‌లో వీరందరికీ క్లాసులు ప్రారంభించాలని ఆదేశించింది.  అయితే ఎవ‌రూ కాలేజీల‌కు హ‌జ‌రుకారు అని తెలుస్తోంది. టీచ‌ర్ టీచింగ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో కూడా విడుద‌ల చేస్తారు. దీనికోసం స్కైప్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ వంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగించుకోవాలని చెప్పింది స‌ర్కార్ . అలాగే ఈ ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన వీడియోలను రికార్డు కూడా చేయాలని స్పష్టంచేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: