క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రీడాటోర్నీల‌న్నీ వాయిదా ప‌డ్డాయి.. మ‌రికొన్ని టోర్నీలు ఏకంగా ర‌ద్దు అయ్యాయి. క్రీడాకారులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. హాయిగా కుటుంబాల‌తో గ‌డుపుతున్నారు. ఈక్ర‌మంలోనే స్పానియార్డ్ ప‌లువురు టెన్నీస్ స్టార్స్‌తో స‌ర‌దాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రోగ్రామ్ నిర్వ‌హించింది. కోర్టులో నిత్యం భీక‌ర పోరులో త‌ల‌ప‌డే ఆట‌గాళ్లు స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెప్పుకున్నారు. రాఫెల్ నాద‌ల్‌, రోజ‌ర్ ఫెడ‌ర‌ర్‌, ఆండీ ముర్రె త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు. అయితే.. రాఫెల్ నాద‌ల్‌కు ఇదే మొద‌టి సారి కావ‌డంతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వ‌హించ‌డం.. ఇత‌రుల‌ను లైవ్‌లోకి తీసుకురావ‌డానికి నానాతంటాలు పడ్డాడ‌ట‌. ఇందులో ప్ర‌ధానంగా రాఫెల్ నాద‌ల్‌, రోజ‌ర్ ఫెడ‌ర‌ర్ ఎన్నో క‌బుర్లు చెప్పుకున్నారు.

 

నిజానికి.. వీర‌ద్ద‌రూ కోర్టులోకి దిగితే ఆ పోరు ఎంత భీక‌రంగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలిసిందే. సుమారు 15ఏళ్లుగా ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వీరిద్ద‌రూ మాట్లాడుకోవ‌డం ఇదే మొద‌టి సార‌ట‌. దీంతొ వారు ఎంతో ఆప్యాయంగా..ఆనందంగా మాట్లాడుకున్నారు. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌మ టెన్నీస్ హీరోలు ఇలా మాట్లాడుకోవ‌డం చూసిన అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: