గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. క‌రోనా వైర‌స్ కట్ట‌డికి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా ఆయ‌న నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వారి అవ‌స‌రాలు తీర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం కిషన్‌బాగ్‌లోని క‌రోనా వైర‌స్‌ కట్టడి ప్రాంతంలో ప్రజలకు నిత్యావసర స‌రుకుల‌ను ఆయ‌న అంద‌జేశారు. అయితే.. అప్ప‌టివ‌ర‌కు బాగానే ఉన్న ఆయ‌న‌కు సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే నానల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయ‌న గుండెలో రెండు వాల్వ్‌లు బ్లాక్‌ అయినట్లు గుర్తించిన డాక్టర్లు స్టంట్‌లు వేసి ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

 

అయితే ప్రస్తుతం మోజంఖాన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐఎంఐఎం సీనియర్‌ నాయకులు తెలిపారు. విష‌యం తెలియ‌గానే చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌, కార్వాన్‌ ఎమ్మెల్యేతోపాలు ప‌లువురు నాయ‌కులు, ప్ర‌ముఖులు ఆస్పత్రి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: