ప్ర‌పంచాన్ని వణికించాడు... అగ్ర‌రాజ్యం అమెరికాను సైతం గ‌డ‌గ‌డ‌లాడించాడు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్.. అయ‌తే ప్ర‌స్తుతం కిమ్ ఆరోగ్య ప‌రిస్థితి పై అంత‌ర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌కు క‌రోనా సోకిందని, ఆయ‌న ప్ర‌స్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడ‌ని మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డటం గ‌మ‌నార్హం. 

 

ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతున్న వేళ‌... అధ్య‌క్షుడు కిమ్ క‌నిపించ‌కుండా పోవ‌డంపై అటు దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.   కిమ్ తో పాటు ఆయ‌న కుటుంబం మొత్తం క్వారంటైన్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న తాత జ‌యంతి వేడుకల‌కు సైతం కిమ్ హాజ‌రుకాక‌పోవ‌డం ఈ అ నుమానాల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. వాస్త‌వానికి కిమ్ తాత జ‌యంతిని దేశ‌వ్యాప్తంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. నేష‌న‌ల్ హాలిడేగా కూ డా ప్ర‌క‌టించారు. ఈక్ర‌మంలోనే తాత జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌క‌పోవ‌డం, ఇటీవ‌ల క‌నిపించ‌కుండా పోవ‌డంపై కిమ్ ఆరోగ్య ప‌రిస్థితిపై మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.  ప్ర‌పంచానికి తెలియ‌కుండా ఉత్త‌ర కొరియా ఏదో దాస్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: