గడచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ జిల్లా వ్యాప్తంగా  35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఏపీలో  757 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  రాష్ట్రంలో 22 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 639 మంది వైద్యాన్ని పొందుతున్నారు.  వైద్యశాఖ అందించిన సమాచారం ప్రకారం గడచిన 24 గంటలలో 35  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 10 కరోనా కేసులు నమోదు కాగా గుంటూరులో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

 

కృష్ణాజిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు, కడపలో 6, అనంతపూర్ 3 కరోనా పాజిటివ్ కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 కరోనా పాజిటివ్ కేసులు కలిపి గడచిన 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరియు రెండు మరణాలు సంభవించాయి అని ఆరోగ్య శాఖ తెలియజేసింది. అత్యధికంగా కర్నూలులో 184 కేసులు నమోదయ్యాయి మరియు5గురు చనిపోయారు. గుంటూరులో 158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరియు గడచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోగా ఈ జిల్లాలో మొత్తం 5 గురు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది చనిపోయారు మరియు 96 మంది కోలుకొని రికవరీ అయ్యారు. మొత్తం మీద రాష్ట్రం అంతా 757 కరోనా కేసులు నమోదయ్యాయి మరియు 639 యాక్టివ్ కేసులు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: