దేశంలో ఇప్పుడు కరోనా భయంతో అందరూ ఇంటిపట్టున ఉంటున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా మహమ్మారికి భయపడిపోతున్నారు. గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలు అన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం మే 7వ తేది వరకు లాక్ డౌన్ ను పొడగించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఎంతో మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది.
ఇందులో భాగంగానే వచ్చే విద్యాసంవత్సరం ప్రయివేటు పాఠశాలలు ఫీజులను నియంత్రించాలని, కేవలం నెలవారి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని జీవో నెం.46ను ప్రభుత్వం విడుదల చేసింది. దినసరి కూలీలు, చిరు వ్యాపారులు ఇంటి పట్టున ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఆదేవాలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు.
ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ తో కలుపుకుని అన్ని ప్రయివేటు పాఠశాలలకు జీవో వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవో ఉల్లంఘిస్తే.. విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.